చేప ప్రసాదం పంపిణీకి అంతా సిద్ధం

83చూసినవారు
చేప ప్రసాదం పంపిణీకి అంతా సిద్ధం
మృగశిర కార్తె పురస్కరించుకొని బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీకి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమయ్యే చేప మందు పంపిణీ 36 గంటల పాటు కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా కర్ణాటక, TN, MH, GT, MP, బీహర్, UP, ఒడిశా, చత్తీస్‌ఘడ్ తదితర రాష్ట్రాల నుంచి ఆస్తమా బాధితులు వస్తుంటారు. ఇప్పటికే ఎగ్జిబిషన్ మైదానం ఆస్తమా వ్యాధిగ్రస్తులతో నిండిపోయింది.

సంబంధిత పోస్ట్