లోక్సభ ఎన్నికల తర్వాత EVMల వ్యవహారం మరోసారి వేడెక్కేలా కనిపిస్తోంది. EVMలను హ్యాక్ చేయొచ్చని ఎలాన్ మస్క్ ప్రకటించాక రాహుల్ గాంధీ ఆదివారం ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. 'భారత్లో EVM లు బ్లాక్ బాక్స్ వంటివి. వాటిని తనిఖీ చేయడానికి ఎవరికీ అనుమతి లేదు. మన ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సంస్థలకు జవాబుదారీతనం లేనప్పుడు, ప్రజాస్వామ్యం మోసానికి గురవుతుంది' అని పేర్కొన్నారు.