స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్ళిన ఓ బృందానికి విషాదం మిగిలింది. స్వప్నిల్ ధావాడే(38) అనే మాజీ ఆర్మీ జవాన్ తన 30 మంది స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు మహారాష్ట్రలోని తమిని ఘాట్ వాటర్ ఫాల్స్ కు వెళ్లారు. అయితే వీడియో తీయమని చెప్పి స్వప్నిల్ వాటర్ ఫాల్స్లో దూకాడు. ఆ తర్వాత పైకి తేలిన అతను దరిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కానీ నీటి ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుపోయాడు. గాలింపు చేపట్టగా 2 రోజులకు చనిపోయి కనిపించాడు.