ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మినహా ఎవరూ గొప్పగా రాణించలేదు అని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. ’ఒక పేసర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. టర్నింగ్ ట్రాక్పై మన స్పిన్నర్లు ప్రభావం చూపించలేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడే 200+ టార్గెట్ కష్టమని భావించాం. ఇంగ్లాండ్ బ్యాటర్లు సింగిల్స్ తీసినట్లు భారత టాప్ బ్యాటర్లు స్ట్రైక్ను రొటేట్ చేయలేదు’ అని ఆకాశ్ అన్నారు.