మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహబూబ్నగర్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. బీజేపీ అభ్యర్థి డి.కె.అరుణ 8 వేల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. మహబూబ్నగర్లో రౌండ్ రౌండ్కు ఫలితాలు మారుతున్నాయి. 15వ రౌండ్లో 15 వేలకు పైగా ఉన్న డి.కె.అరుణ మెజారిటీ.. 16వ రౌండ్ ముగిసే సమయానికి 8,793కి పడిపోయింది.