దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 7 దశల ఎన్నికల్లో ప్రస్తుతానికి 4వ దశ ఎన్నికలు ముగిశాయి. సాధారణంగా అన్ని దశల పోలింగ్ తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతాయి. ముందుగా రిలీజ్ చేస్తే మిగతా దశల ఎన్నికలు ప్రభావితం అవుతాయనే కారణంతో ఎగ్జిట్ పోల్స్పై ఈసీ ఆంక్షలు విధిస్తుంది. జూన్ 1న చివరిదైన 7వ దశ పోలింగ్ జరగనుండగా.. అదే రోజు సాయంత్రం 6.30 నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడతాయి.