గనిలో పేలుడు.. నలుగురు మృతి

50చూసినవారు
గనిలో పేలుడు.. నలుగురు మృతి
యూపీలోని మహోబా జిల్లాలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. కబ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహారా గ్రామ సమీపంలోని గనిలో అక్రమ మైనింగ్ చేపడుతున్నారు. అక్కడ పేలుడు జరిగి నలుగురు చనిపోయారు. మరో 8 మంది కార్మికులు సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత లేదు. గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్