ఈనెల 18 వరకు నుమాయిష్‌ పొడిగింపు

71చూసినవారు
ఈనెల 18 వరకు నుమాయిష్‌ పొడిగింపు
దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ గా పేరున్న నుమాయిష్ ను ఈనెల 18 వరకు పొడిగించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 15తో నుమాయిష్‌ ముగియనుండగా.. 3 రోజులు అదనంగా పొడిగిస్తున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రకటించింది. HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఎగ్జిబిషన్ లో దేశ, విదేశాలకు చెందిన 2400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి రోజు మ. 3:30 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు ఓపెన్ ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్