మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లిలో యువకుడి దారుణహత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి ఎరుకలి వెంకటేశ్ (28)ను ఎరుకలి నరసింహులు హతమార్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం పొన్నారం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్ కమ్మరిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో మహేందర్ను గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి పిలిపించుకుని హతమార్చి పొలిమేరల్లోకి తీసుకెళ్లి తగులబెట్టారు.