పని ఒత్తిడి కారణంగా అన్నా సెబాస్టియన్ మృతి చెందినట్లు వస్తున్న ఆరోపణలపై ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ తీవ్రంగా ఖండించింది. ఈవైలో పని ఒత్తిడి కారణంగా అన్నా మరణించిందనే తల్లి చేసిన ఆరోపణలపై ఈవై సంస్థ ఛైర్మన్ రాజీవ్ మెమానీ ఖండించారు. "అన్నా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి జీవితంలో అన్నా లేని వెలితిని ఎవరూ తీర్చలేరు. ఆమె మరణానికి, కంపెనీ పనిభారానికి ఎటువంటి సంబంధం లేదు" అని రాజీవ్ మెమానీ పేర్కొన్నారు.