డ్రోన్‌లకు గాలిపటాలతో చెక్ పెడుతున్న రైతులు

550చూసినవారు
డ్రోన్‌లకు గాలిపటాలతో చెక్ పెడుతున్న రైతులు
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనల తెలుపుతున్న సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పోలీసుల డ్రోన్‌లను అడ్డుకునేందుకు రైతులు గాలిపటాలు ఎగురవేయడం ప్రారంభించారు. ఇందుకోసం రైతులు లెక్కలేనన్ని గాలిపటాలు తీసుకొచ్చి ఎగురవేయడం ప్రారంభించారు. దీంతో గాలిపటాల తీగలకు డ్రోన్లు చిక్కుకుని కింద పడిపోతున్నాయి. కాగా, శంభు సరిహద్దులో పంజాబ్ నుంచి వస్తున్న రైతులపై హర్యానా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్