చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన రైతులు

567చూసినవారు
చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన రైతులు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి బయల్దేరిన చంద్రబాబుకు దారి పొడవునా పూలు చల్లి అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రేన్‌ సాయంతో భారీ గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. దారి పొడవునా రైతులకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు.

సంబంధిత పోస్ట్