మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. శివపురి జిల్లాలో మానవత్వం మరిచిన కొడుకు తన తండ్రికి చిత్రహింసలు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హేమంత్ మిట్టల్ అనే వ్యక్తి మానసిక వ్యాధిగ్రస్థుడైన తన తండ్రిని కొట్టి కిరాతకంగా ఈడ్చుకెళ్లాడు. అతడికి ఆయన భార్య కూడా సహకరిచింది. ఇంటి బాల్కనీ నుంచి వృద్ధుడి కేకలు వినిపించడంతో స్థానికులు వీడియో తీసి వైరల్ చేశారు.