డ్రగ్స్ నియంత్రణలో సినీ రంగం భాగం అవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ‘భారతీయుడు-2’ చిత్రయూనిట్ ముందుకొచ్చింది. ఈ చిత్రంలోని నటులు కమల్హాసన్, సిద్ధార్థ్, సముద్రఖనితో డైరెక్టర్ శంకర్ డ్రగ్స్కు నో చెప్పాలని యువతకు పిలుపునిచ్చారు. ‘మీరు వెళ్లే మార్గం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి డ్రగ్స్కు నో చెప్పండి. తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు’ అని కమల్హాసన్ వీడియోలో తెలిపారు.