చెత్త, ఉమ్మివేయడంపై జరిమానా... రైల్వేకు రూ.5 కోట్ల ఆదాయం

71చూసినవారు
చెత్త, ఉమ్మివేయడంపై జరిమానా... రైల్వేకు రూ.5 కోట్ల ఆదాయం
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో రైల్వే స్టేషన్ ఆవరణలో చెత్త, ఉమ్మివేయడంపై జరిమానా ద్వారా రైల్వేకు భారీగా ఆదాయం సమకూరింది. రూ.5.13 కోట్ల మేర రైల్వేకు ఆదాయం సమకూరిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. వీటిపై జరిమానా మొత్తాన్ని పెంచే ప్రతిపాదన లేదన్నారు. రైల్వే ప్రాంగణాలను మురికిగా లేదా చెత్తగా చేయవద్దని ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్