ఉత్తరాఖండ్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు నెలలు గడుస్తున్నా అదుపులోకి రావడం లేదు. బలమైన కార్చిచ్చు కారణంగా అక్కడి అడవులు తగలబడిపోతున్నాయి. దీంతో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగి హెలికాప్టర్ల ద్వారా నీటిని వెదజల్లినా మంటలు అదుపులోకి రావడం లేదు. ఇక ఈ మంటల వల్ల నాలుగు రోజుల్లో సుమారు ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.