అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన ఆడారి కిషోర్ కుమార్ తాజాగా వైసీపీలో చేరారు. టికెట్ పై స్పష్టమైన హామీ రావడంతోనే సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది వరకే బూడి ముత్యాలనాయుడిని వైసీపీ అనకాపల్లి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.