ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేసే పనిలో పడ్డారు. అయితే బస్సు పార్కింగ్లో ఉండగా ప్రమాదం సంభవించడంతో అందులో విద్యార్థులెవరూ లేరని తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.