బీహార్లోని పాటలీపుత్రలో శనివారం సాయంత్రం షాకింగ్ ఘటన జరిగింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి రాంకృపాల్ యాదవ్పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది.