ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన చేపలు లూటీ (Video)

83చూసినవారు
బీహార్‌లోని సహర్సా జిల్లాలో శుక్రవారం సీఎం నితీశ్‌ కుమార్‌ పర్యటించారు. ఈ సందర్భంగా అమర్‌పూర్‌లో మత్స్యశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కూడా సీఎం పరిశీలించారు. ఎగ్జిబిషన్‌లో భాగంగా బయోఫ్లోక్‌ ట్యాంక్‌లో పెద్ద ఎత్తున చేపలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అక్కడ గందరగోళ పరిస్థితి తలెత్తింది. సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత స్థానికులు చేపలను లూటీ చేశారు. చేపలను ప్రజలు లూటీ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్