మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో డ్రైవర్ సహా ఐదుగురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ధర్మేంద్ర ఠాకూర్ అనే 18 ఏళ్ల బాలుడు.. మార్కమ్(10), అనూప్(12), రాజ్వీర్ (13), దేవేంద్ర(15), దళ్పత్(12), వికాస్(10)లు మృతి చెందారు. సీఎం మోహన్ యాదవ్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.