నీట్‌ పేపర్‌ లీకేజీ వార్తలపై NTA స్పందన ఇదే!

82చూసినవారు
నీట్‌ పేపర్‌ లీకేజీ వార్తలపై NTA స్పందన ఇదే!
నీట్‌ యూజీ-2024 పరీక్ష పేపర్‌ లీకైందంటూ జరుగుతున్న ప్రచారంపై నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) స్పందించింది. ఇది ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. రాజస్థాన్‌ రాష్ట్రం మాదోపూర్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో కొందరు విద్యార్థులు పరీక్ష సమయం ముగియకముందే ప్రశ్నపత్రాలు తీసుకుని బయటకు వెళ్లారని, అదే పేపర్‌ లీకేజీ ప్రచారం జరుగుతోందని అధికారులు తెలిపారు. పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించామని, పేపర్ లీకయ్యే ఛాన్సే లేదని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్