టీమిండియాకు కొత్త జెర్సీ వచ్చింది. జూన్ 1 నుంచి జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత క్రికెటర్లు ఈ జెర్సీని ధరించనున్నారు. అడిడాస్ సంస్థ ఈ జెర్సీ ఫొటోలను సోమవారం ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఉన్నారు. ఈ కొత్త జెర్సీలో మొత్తం మూడు రంగులు ఉన్నాయి. అయితే కాషాయ రంగు ఉండడంతో కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.