పారిస్ ఒలింపిక్స్ అర్హత పోటీలుగా నిర్వహిస్తున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్కు
భారత్ రెజ్లర్లు దూరమయ్యారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న భారత ఉత్తమ రెజర్లు పునియా(86 కేజీలు), సుజీత్ కలాకల్(65 కేజీలు).. పోటీలు జరుగుతున్న కిర్గిజ్స్థాన్లోని బిష్కెక్కు ఆలస్యంగా చేరుకున్నారు. నిబంధనల ప్రకారం అప్పటికే రెజ్లర్ల బరువు పరీక్షించడం ముగియటంతో.. పోటీల్లో పాల్గొనడానికి అనుమతించలేదు.