ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సామర్థ్యం ఆధారంగా ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు సాగిస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 5- 7 శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేయనుంది. ఈ ఏడాది మార్చి- ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియను ముగించాలని ఫ్లిఫ్కార్ట్ యోచిస్తోంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా గత ఏడాది నుంచి తాజా నియామకాలను ఫ్లిప్కార్ట్ నిలిపివేసింది.