కజిరంగ నేషనల్‌ పార్క్‌ను ముంచెత్తిన వరద(వీడియో)

54చూసినవారు
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 8 నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల కారణంగా రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది ప్రజలు ముంపు ప్రాంతంలో చిక్కుకుపోయారు. వారందరినీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే ఈ వరదల ప్రభావం కజిరంగ జాతీయ పార్కు పై కూడా పడింది. పార్కులోకి భారీగా నీరు చేరి 4 జింకలు మృతి చెందాయి. సుమారు 24 ఇతర జంతువులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.

సంబంధిత పోస్ట్