ఫుడ్ పాయిజన్.. 15 మందికి అస్వ‌స్థ‌త‌

61చూసినవారు
ఫుడ్ పాయిజన్.. 15 మందికి అస్వ‌స్థ‌త‌
జనగామ ఏబీవీ కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కావ‌టంతో 15 మంది ఇంట‌ర్ విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అయితే హాస్ట‌ల్ సిబ్బంది ఆర్ఎంపీతో రహస్యంగా విద్యార్థుల‌కు చికిత్స అందిస్తున్న‌ట్లు స‌మాచారం. ఫుడ్ పాయిజన్ అయిన‌వారిలో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వారిని జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై యాజ‌మాన్యం మౌనం పాటిస్తుంది. మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్