పాలకుర్తిలో ఆంధ్ర మహాసభ ఏర్పాటు

51చూసినవారు
పాలకుర్తిలో ఆంధ్ర మహాసభ ఏర్పాటు
పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామానికి చెందిన దేశముఖ్ రాపాక రాంచంద్రారెడ్డి 60 గ్రామాలకు పాలకుడు. అతను రజాకార్ నాయకుడు ఖాసీం రజ్వీ నాయకత్వంలో ఉపనాయకుడిగా ఉండేవాడు. ఈ క్రమంలో రాం చంద్రారెడ్డి కుమారుడు బాబుదొర ఆగడాలకు అంతులేకుండా పోయింది. పేదలను సజీవ దహనం చేయడం, పంటపొలాలు నిప్పు పెట్టడం, ఆడవారి మానప్రాణాలు దోచుకుంటూ దుర్మా ర్గంగా వ్యవహరించాడు. దొరల దాష్టీకానికి వ్యతిరేకంగా పాలకుర్తిలో ఆంధ్ర మహాసభ ఏర్పాటుకు ఐలమ్మ భర్త నర్సింహ, కుమారులు, మరికొంత మంది కృషి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్