లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇవాళ అధికారికంగా ప్రకటించారు. కర్ణాటకలోని మాండ్య పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీతో పొత్తులో భాగంగా తమ పార్టీ మాండ్య, కోలార్, హాసన్ స్థానాల నుంచి పోటీ చేస్తుందని కుమారస్వామి ప్రకటించారు.