ఆరో దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ దేశంలోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్లాల్ ఖట్టర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానా రాష్ట్రం కర్నాల్ లోక్సభ స్థానంలోని ఓ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఖట్టర్ కర్నాల్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.