ఉపాధ్యాయులు లేక బడికి తాళం వేసిన గ్రామస్థులు

77చూసినవారు
ఉపాధ్యాయులు లేక బడికి తాళం వేసిన గ్రామస్థులు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులు కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు మొత్తం 95 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్నారని తెలిపారు. అయితే, పాఠశాలలో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు అంతమంది పిల్లలకు పాఠాలు చెప్పలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాఠశాలకు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను నియమించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్