తమ సంస్థకు చెందిన 14 ఉత్పత్తుల సేల్స్ నిలిపివేసినట్లు పతంజలి సుప్రీంకోర్టుకు వెల్లడించింది. వీటికి సంబంధించిన యాడ్స్ను తొలగించాలని మీడియా ప్లాట్ఫామ్స్కు సమాచారం అందించినట్లు తెలిపింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం వీటి లైసెన్స్లు క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. శ్వాసరీ గోల్డ్, లిపిడోమ్, మధుగ్రిట్, బీపీగ్రిట్, లివామ్రిత్ అడ్వాన్స్, లివోగ్రిట్ మొదలైన ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి.