ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ ఇండియా మాజీ చీఫ్ అవతార్ సైనీ (Avtar Saini) (68) గురువారం ఉదయం కన్నుమూశారు. నవీ ముంబయి టౌన్షిప్లో సైక్లింగ్ చేస్తున్న సమయంలో ఓ క్యాబ్ వచ్చి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.