ఢిల్లీలోని తీహార్ జైలులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆ పార్టీ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ఉదయం ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని కవితకు సూచించారు. ఇటీవలే మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ కవితతో ములాఖత్ అయిన విషయం విదితమే.