మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం

576చూసినవారు
మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం
భారత ప్రజలు ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 కోసం వేచిచూస్తున్నారు. ఎన్నో రంగాలు, మరెన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 1959 నుంచి 1964 మధ్యకాలంలో 6 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు వరుసగా 6 సార్లు ప్రవేశపెట్టిన వ్యక్తిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు. దీంతో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డు సమం అవుతుంది.

సంబంధిత పోస్ట్