ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పరార్

562చూసినవారు
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పరార్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావుకు అండగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాను సమాచారాన్ని ధ్వంసం చేశానని ప్రణీత్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన అమెరికాకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్