హైదరాబాద్ నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం బేగంపేటలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ అగంతకులు.. తుపాకీతో బెదిరించి చోరికి యత్నించారు. అయితే దుండగులను ఇంట్లోని తల్లీ కూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. అగంతకుల వద్ద నుంచి తుపాకీ లాక్కొని ఎదురు దాడికి దిగారు. ఊహించని పరిణామంతో ఖంగుతిన్న దుండగులు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.