రష్యాలోని విషాద ఘటన జరిగింది. సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు నదిలో మునిగిపోయారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందగా, స్థానికులు అందులో ఒకరిని రక్షించారు. మృతుల్లో 18-20 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరు వెలికి నొవ్గోరోడ్ నగరంలోని సమీపంలోని నొవ్గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్నారు.