ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రేమ్నగర్లోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మొదటి అంతస్తులో ఉంచిన ఇన్వర్టర్లో మంటలు చెలరేగి పై అంతస్తుకి వ్యాపించాయి. ఇక్కడ నిద్రిస్తున్న కుటుంబం మొత్తం మృతి చెందింది. మృతులను హీరా సింగ్ (48), అతని భార్య నీతూ సింగ్, కుమారులు రాబిన్ సింగ్ (22), లక్షయ్ (21)గా గుర్తించారు.