మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి (వీడియో)

10060చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా వనపట్లలో తీవ్ర విషాదం నెలకొంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో తల్లి పద్మ(26 ), కూతుళ్లు పప్పి(6 ), వసంత (7), కుమారుడు నిక్కి మృతి చెందారు. పద్మ భర్త భాస్కర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే తిని ఇంట్లో పడుకున్నారు. ఆదివారం కురిసిన వర్షానికి అర్థరాత్రి ఇంటి పైకప్పు కూలి నలుగురు చనిపోవడం విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్