నదిలో ఈతకు దిగి నలుగురు మహిళలు మృతి

571చూసినవారు
నదిలో ఈతకు దిగి నలుగురు మహిళలు మృతి
తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలో గుడియాతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆలయం సమీపంలోని నదిలో ఈతకు వెళ్లిన నలుగురు మహిళలు గల్లంతయ్యారు. భక్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ టీం సహాయంతో మహిళల మృతదేహాలను బయటకు తీశారు. మహిళల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్