హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేస్తోన్న ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని ప్రభుత్వం పొడిగించింది. సచివాలయం, అసెంబ్లీ, హెచ్వోడీ, రాజ్భవన్ ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పనిచేస్తున్న వారికి 2024 జూన్ 27 నుంచి వచ్చే ఏడాది జూన్26 వరకు ఉచిత వసతి వర్తిస్తుందని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.