హైదరాబాద్‌ నుంచి వచ్చే ఉద్యోగులకు మరో ఏడాదిపాటు ఉచిత వసతి: ఏపీ ప్రభుత్వం

55చూసినవారు
హైదరాబాద్‌ నుంచి వచ్చే ఉద్యోగులకు మరో ఏడాదిపాటు ఉచిత వసతి: ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చి పనిచేస్తోన్న ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని ప్రభుత్వం పొడిగించింది. సచివాలయం, అసెంబ్లీ, హెచ్‌వోడీ, రాజ్‌భవన్‌ ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పనిచేస్తున్న వారికి 2024 జూన్‌ 27 నుంచి వచ్చే ఏడాది జూన్‌26 వరకు ఉచిత వసతి వర్తిస్తుందని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

సంబంధిత పోస్ట్