బొప్పాయి, అరటి, నారింజ పండ్లలో హిస్టామిన్ ఎక్కువగా ఉంటుందని, ఈ రసాయనం అలెర్జీ కారకాలకు ప్రతిస్పందిస్తుందని క్లినికల్ డైటీషియన్ సుష్మ తెలిపారు. పండ్లంటే అలెర్జీ ఉన్నప్పుడు, ఇవి తినడం వల్ల శరీరం హిస్టామిన్ ను ప్రేరేపిస్తుంది. దాని వల్ల తుమ్ములు రావడంతో పాటు ముక్కు కారుతూ ఉంటుంది. జలుబుతో ఉన్న సమయంలో స్ట్రాబెర్రీస్, పుచ్చ, యాపిల్ వంటి పండ్లను తీసుకోవచ్చు.