కర్ణాటకలో తాజాగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. పెట్రోల్ ధర లీటర్కు రూ.3 పెంచామని, అయినప్పటికీ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే కర్ణాటకలో ఇంధన ధరలు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని చెప్పారు. ఇదే సమయంలో బీజేపీపై ఆయన విమర్శలతో విరుచుకుపడ్డారు. గతంలో రాష్ట్ర వనరులను బీజేపీ ఇతర రాష్ట్రాలకు మళ్లించిందని ఆరోపించారు.