మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం స్పృహ తప్పి పడిపోయారు. రాష్ట్రంలో మహాయుతి కూటమి అభ్యర్థి రాజశ్రీ హేమంత్ పాటిల్కు మద్దతుగా పూసాద్లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. సభలో మాట్లాడుతుండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. స్పృహ తప్పిన పడిపోతున్న ఆయనను బాడీగార్డులు పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.