పెళ్లి భోజనం తిన్న సుమారు 70 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. అంబేడ్కర్ నగర్లో ఇవాళ జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన వారు అక్కడ వడ్డించిన ఆహారాన్ని తిన్నారు. అనంతరం 70 మందికిపైగా అస్వస్థతకు గురి కాగా వారందరినీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ కావచ్చని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.