పెళ్లి భోజనం తిని 70 మందికి అస్వస్థత (వీడియో)

79చూసినవారు
పెళ్లి భోజనం తిన్న సుమారు 70 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అంబేడ్కర్‌ నగర్‌‌లో ఇవాళ జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన వారు అక్కడ వడ్డించిన ఆహారాన్ని తిన్నారు. అనంతరం 70 మందికిపైగా అస్వస్థతకు గురి కాగా వారందరినీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ కావచ్చని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్