తనకు చరిత్ర అంటే ఎంతో ఆసక్తి అని బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలిపారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ప్రమోషన్స్తో బిజీగా ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్, మహాత్మాగాంధీల గురించి మాట్లాడారు. ‘ఈ ఇద్దరి గురించి వినడం, మాట్లాడటం నాకెంతో ఇష్టం. వీళ్లు మన సమాజానికి ఎంతో సాయం చేశారు. ఎంతోమందిలో స్ఫూర్తి నింపారు. అందుకే ఈ ఇద్దరికీ సంబంధించిన ఏ అంశమైనా నాకు ఆసక్తిగానే ఉంటుంది’ అని వివరించారు.