గ్యాంగ్ వార్.. కార్లతో వ్యక్తులను ఢీకొట్టి బీభత్సం(వీడియో)

68చూసినవారు
అర్ధరాత్రి రెండు గ్యాంగులు రోడ్డుపై విధ్వంసం సృష్టించాయి. ఈ నెల 18న కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రెండు కార్లు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటూ ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. రాడ్లు పట్టుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరిని కారుతో బలంగా ఢీ కొట్టడంతో అతను రోడ్డుపై పడిపోయాడు. అతడిపై మరో ఇద్దరు దాడి చేశారు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఈ కేసులో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్