గ్యాంగ్‌స్టర్ అతిఖ్ బినామీ ఆస్తి రూ.50 కోట్లు జప్తు

61చూసినవారు
గ్యాంగ్‌స్టర్ అతిఖ్ బినామీ ఆస్తి రూ.50 కోట్లు జప్తు
జైలులో దారుణహత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతిఖ్ అహ్మద్‌‌కు చెందిన రూ.50 కోట్ల విలువైన ఆస్తిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ గ్యాంగ్‌స్టర్ కోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి సంచలన ఆదేశాలిచ్చింది. నేరపూరిత కార్యకలాపాల ద్వారా వచ్చిన సొమ్ముతో ప్రయాగరాజ్‌లో 2.77 ఎకరాల ఆస్తిని అతిఖ్ సేకరించారు. అతిఖ్ తన బినామీ అయిన హూబలాల్ తరఫున భూమిని రిజిస్టర్ చేసినట్టు ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్