ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్.. ప్రయాణికులకు అస్వస్థత

79చూసినవారు
ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్.. ప్రయాణికులకు అస్వస్థత
మలేషియాలోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ సదుపాయంలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో సుమారు 39 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే, ప్రయాణికులు ఎవరూ తీవ్రంగా ప్రభావితం కాలేదని, విమాన ప్రయాణాలను కూడా ఎలాంటి అంతరాయాలు కలగలేదని అగ్నిమాపక శాఖ తెలిపింది. గ్యాస్ లీక్ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్